వివాదాస్పద వాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా రిలీజ్ అయ్యి సంచలనం రేకెత్తిస్తున్న కేరళ స్టోరీ చిత్రం పై
స్పందించారు. ‘‘ఈ వివాదాస్పద సినిమా ప్రధాన స్రవంతిలోని బాలీవుడ్ మృత ముఖానికి దెయ్యం మాదిరి అద్దం పడుతోంది’’ అని వర్మ వ్యాఖ్యానించారు. కేరళ స్టోరీస్ కు మద్దతుగా లోగడే వర్మ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా మరోసారి తన వ్యాఖ్యల్లోనూ ఈ సినిమాకు మద్దతు పలికారు.
‘‘ఎవరైనా మనకంటే ముందుకు చొచ్చుకుపోయి, మనం షాక్ అయ్యే నిజాలు చెబితే, అప్పుడు ఇతరులతో, మనతో మనం అబద్ధాలు చెప్పుకోవడంలో ఎంతో సౌకర్యంగా ఉంటాం. కేరళ స్టోరీ దిగ్భ్రాంతికరమైన విజయం పట్ల బాలీవుడ్ మౌనంగా ఉండడం ఇదే తెలియజేస్తోంది. బాలీవుడ్ లో ప్రతి స్టోరీ చర్చా గదిలో, కార్పొరేట్ హౌస్ లలో ద కేరళ స్టోరీ ఎప్పటికీ ఓ మిస్టీరియస్ పొగమంచులా వెంటాడుతూనే ఉంటుంది. కేరళ స్టోరీ నుంచి నేర్చుకోవడం కష్టం. ఎందుకంటే నిజాన్ని అనుసరించడం కంటే అబద్ధాన్ని ఆచరించడం సులభం’’ అని వర్మ వరుస ట్వీట్లలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
The #KeralaStory is like a BEAUTIFUL GHOSTLY MIRROR showing the DEAD face of Main stream BOLLYWOOD to itself in all its UGLINESS
mdash; Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2023