రాజకీయాలు అన్న తరువాత విబేధాలు రావడం అనేది కామన్. అవి సొంత పార్టీలో అయితే వాటి వలన వచ్చే తలనొప్పుల గురించి వర్ణించడం అసాధ్యమే అని చెప్పుకోవాలి. తాజాగా కాంగ్రెస్ పార్టీలోనూ అటువంటి పరిస్థితులే నెలకొన్నాయి . వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కొండా దంపతుల ఫొటోలు లేకపోవడంపై వారి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కొండా వర్గం, ఎర్రబెల్లి వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలవారు పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు.