చింతపండు ఇది రుచికి తీపి మరియు పులుపు కలిసినట్టుగా ఉంటుంది. ఈ చింతపండుని చూడగానే నోట్లో నీళ్ళు ఊరతాయి. ఈ చింతపండుని పండుగానే కాకుండా కాయలుగా ఉన్నప్పుడు కూడా వాడుకుంటారు. వంటకాలలో వాడుకునే ఈ పండుతో సాంబార్, పులుసు, పులిహోర మరియు పచ్చళ్ళు వంటివి తయారుచేస్తారు. అయితే చింతపండు మాత్రమె కాకుండా వాటిలో ఉండే గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి అనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్య ఔషధం. ముందుగా కొన్ని చింత గింజలను తీసుకుని వాటిని బాగా వేయించాలి. అనంతరం 2 రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలి. 2 రోజుల తరువాత చింత గింజలను తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంతరం వచ్చే విత్తనాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టాలి. అలా ఎండిన ముక్కలను తీసుకుని మిక్సీలో వేసి పొడిగా పట్టాలి. ఆ పొడిని జార్లో నిల్వ చేసుకోవాలి. దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని రోజుకు రెండు సార్లు నీటితో లేదా పాలతో నెయ్యి లేదా చక్కెరను కలిపి తీసుకోవాలి.
ఇలా చేయడం వలన మోకాళ్ల నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు 3-4 వారాల్లో సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. చింత గింజల్లో ఉండే ఔషధ పదార్థాలు ఎముకలకు బలాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్లలో అరిగిపోయిన గుజ్జును మళ్లీ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది.
* ఈ చింతగింజల పొడి కేవలం కీళ్ల నొప్పులే కాదు డయేరియా, చర్మంపై దురదలు, దంత సంబంధ సమస్యలు, అజీర్ణంవంటి అనేక రోగాలను నయం చేస్తుంది.
* ఇక ఎముకలు వీరిని ప్రదేశంపై రోజూ చింతగింజల పొడిని పేస్ట్లా చేసి అప్లై చేస్తే దాంతో ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
* దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు, డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులకు చక్కని ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది.
* ఇక చింతపిక్కలు: బిస్కట్ ల తయారీలో ఉపయోగిస్తారు. చింత గింజలపై పొట్టు తీసి యంత్రాల ద్వారా మెత్తటి పొడిగా తయారు చేస్తారు. దానిని బిస్కెట్ వంటి వాటిల్లో, ఇతర ఆహార పదార్థాలలో వాడుతారు.
*చింతగింజలను ఎక్కువగా జిగురు తయారు చేయడానికి దీనిని వాడుతారు. గతంలో సినిమా పోష్టర్లు అంటించ డానికి ఈ పిండితో చేసిన జిగురునే ఎక్కువ వాడేవారు.