రోడ్డు ప్రమాదంలో మైనర్ మృతి..

     Written by : smtv Desk | Mon, Feb 05, 2018, 10:58 AM

రోడ్డు ప్రమాదంలో మైనర్ మృతి..

హైదరాబాద్, ఫిబ్రవరి 5 : హైదరాబాద్ బహుదూర్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృత్యు శకటంల దూసుకొచ్చిన లారీ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఇద్దరు మైనర్ పిల్లలు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో నియంత్రణ కోల్పాయారు. దీంతో లారీ చక్రాలు 12 ఏళ్ల రియాజ్ తలపై నుండి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.





Untitled Document
Advertisements