పృథ్వీషాకు మరో భారీ నజరానా..

     Written by : smtv Desk | Mon, Feb 05, 2018, 04:08 PM

పృథ్వీషాకు మరో భారీ నజరానా..

ముంబయి, ఫిబ్రవరి 5: ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీమిండియా జట్టుపై యావత్ భారత్ ప్రశంసలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. వీరి ప్రదర్శనకు బీసీసీఐ కోచ్ ద్రావిడ్ కు రూ.50 లక్షలు, జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపిన విషయం పాఠకులకు విదితమే. ఇప్పుడు తాజాగా అండర్-19 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన పృథ్వీషాకు ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎమ్‌సీఎ) భారీ నజరానా ప్రకటించింది. ఎమ్‌సీఎ అధ్యక్షుడు ఆశిష్‌ పృథ్వీషాకు రూ.25లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.





Untitled Document
Advertisements