సత్తా చాటిన మహిళా క్రికెటర్లు..

     Written by : smtv Desk | Tue, Feb 06, 2018, 10:48 AM

సత్తా చాటిన మహిళా క్రికెటర్లు..

కింబర్లే, ఫిబ్రవరి 6 : ఓ వైపు కోహ్లి సేన సఫారీలను సొంతగడ్డపై ఓడిస్తూ సిరీస్ ను నెగ్గాలని కసితో దూసుకుపోతుంది. ఇప్పుడు అదే దేశంలో మన మహిళా క్రికెటర్లు కూడా తమ సత్తా చాటారు. ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా పై భారత్ మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పై 88 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టీమిండియా జట్టులో స్మృతి మంధాన (84), సారథి మిథాలీరాజ్‌ (45) రాణించడంతో తొలుత భారత్‌ 7 వికెట్లకు 213 పరుగులు చేసింది.

లక్ష్యఛేదనలో సఫారీ మహిళా టీం జులన్‌ గోస్వామి (4/24), శిఖా పాండే (3/23), పూనమ్‌ యాదవ్‌ (2/22) ధాటికి 43.2 ఓవర్లలో 125 ఆలౌటైంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజ వేసింది.





Untitled Document
Advertisements