న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 : వాహనం బోల్తా పడి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సతీమణి జషోదాబెన్ గాయాలపాలయ్యారు. రాజస్థాన్లోని జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తున్న ఆమె వాహనం బోల్తాపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా జషోదా తలకు గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.