వారికే లేదు.. ఇక మాకేం ఇస్తారు : కేటీఆర్

     Written by : smtv Desk | Wed, Feb 07, 2018, 06:57 PM

వారికే లేదు.. ఇక మాకేం ఇస్తారు : కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 7 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మంత్రి కేటీఆర్.. తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీకే ఎలాంటి న్యాయం చేయలేదు. ఇక మా తెలంగాణకు ఏమిస్తారు"? అంటూ వ్యాఖ్యానించారు. 40 వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు పంపితే.. కనీసం బాహుబలి సినిమాకొచ్చిన కలెక్షన్లు కూడా రాలేదంటూ సెటైర్లు వేశారు. టీడీపీ నిరసనలు తెలుపుతూ పోరాడుతున్నా న్యాయం చేయడం లేదు.. అలాంటిది మాకేం ఇస్తారు? అంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఇప్పుడు కేంద్రం నుండి నిధులను రాబట్టకపోతే ప్రజలతో ఏమి చెప్పి మెప్పిస్తారంటూ హేళన చేశారు. 2019లో మా సత్తా ఏంటో నిరూపిస్తామని తెలిపారు.





Untitled Document
Advertisements