మార్చి 5 వరకు లోక్‌సభ వాయిదా..

     Written by : smtv Desk | Fri, Feb 09, 2018, 03:33 PM

మార్చి 5 వరకు లోక్‌సభ వాయిదా..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 : బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై లోక్‌సభలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ స్పీకర్‌ పోడియం చుట్టూ చేరి నిరసన చేశారు. ఎంత చెప్పిన ఆందోళనను విరమి౦చకపోవడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఈ గందరగోళం మధ్య సభను మార్చి 5కు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగడంతో సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.





Untitled Document
Advertisements