దుబాయ్ లో త్రివర్ణ పతాకం వెలుగులు..

     Written by : smtv Desk | Sat, Feb 10, 2018, 04:19 PM

దుబాయ్ లో త్రివర్ణ పతాకం వెలుగులు..

దుబాయ్, ఫిబ్రవరి 10 ‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ యునైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించనున్ననేపథ్యంలో దుబాయ్‌లోని ప్రఖ్యాత ప్రాంతాలన్నీ భారతీయ త్రివర్ణ పతాకం రంగులతో మెరిసిపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్‌ ఖలీఫా, అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ(ఏడీఎన్‌ఓసీ), ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిక్చర్‌ ఫ్రేమ్‌ ‘దుబాయ్‌ ఫ్రేమ్‌’లు భారతీయ జెండా రంగులతో అందరిని కనువిందు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను యూఏఈలో భారత రాయబారి ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.





Untitled Document
Advertisements