హాంగ్కాంగ్, ఫిబ్రవరి 11: హాంగ్కాంగ్లోని ఒక డబుల్డెక్కర్ బస్సు ప్రమాదానికి లోనైంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందగా, 47 మందికి గాయాలయ్యాయి. బస్సు అత్యంత వేగంగా ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వీడియో ఫుటేజీల ద్వారా తెలుస్తోంది. బోల్తా పడిన తర్వాత రెస్క్యూ సిబ్బంది బస్సు టాప్ను కట్ చేసి అందులో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీశారు. బాధిత కుటుంబాలకు 10,230 డాలర్ల నష్టపరిహారం ఇస్తామని ది కవ్లూన్ మోటార్ బస్ కో సంస్థ వెల్లడించింది.