హైదరాబాద్, ఫిబ్రవరి 12 : స్వచ్ఛ సర్వేక్షణ్లో హైదరాబాద్ని అగ్రస్థానంలో నిలపాలని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ కంటే ముందే హైదరాబాద్లో స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాం. తడి-పొడి చెత్తను వేరుచేసేందుకు 45లక్షల చెత్త బుట్టలు పంపిణీ చేశాం. ప్రజల భాగస్వామ్యం లేకుంటే ఏదీ సాధ్యం కాదు" అని వ్యాఖ్యానించారు.