'రంగస్థలం' తొలి పాట.. ఎంత సక్కగున్నావే..

     Written by : smtv Desk | Tue, Feb 13, 2018, 01:57 PM

'రంగస్థలం' తొలి పాట.. ఎంత సక్కగున్నావే..

హైదరాబాద్, ఫిబ్రవరి 13 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రంగస్థలం'. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘రామలక్ష్మి’ టీజర్‌కు విశేష స్పందన లభించింది. కాగా చిత్ర బృందం ఈరోజు తొలి పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా పాట 'ఎంత సక్కగున్నావే..' అంటూ ప్రారంభమవుతుంది. దీంతో పాటు ఓ పోస్టర్ ను కూడా విడుదలచేసింది. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మాణ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే మార్చిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.





Untitled Document
Advertisements