అమరావతి, ఫిబ్రవరి 13 : రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో అంబానీ నేడు విజయవాడకు విచ్చేస్తున్నారు. వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టీజీ సెంటర్ను పరిశీలించనున్న ఆయన అనంతరం చంద్రబాబును కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు.