గుంటూరు, ఫిబ్రవరి 15 : గుంటూరు సర్వజనాస్పత్రిలో పరిస్థితులు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. ఆపరేషన్ ధియేటర్లో డోమ్ లైట్లు పనిచేయక చరవాణి వెలుతురులో ఓ రోగికి వైద్యులు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. బయటకు వచ్చిన ఈ ఆపరేషన్ వీడియో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాడైపోయిన విద్యుత్, వైద్య పరికరాలను సకాలంలో మరమ్మతులు చేయరనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సెల్ఫోన్ వెలుతురులో ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ చేసిన తాజా ఘటనతో జీజీహెచ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్లే ఇలా జరిగిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు తెలిపారు.