వారిని దేవుడు చల్లగా చూడాలి : మోహన్ బాబు

     Written by : smtv Desk | Thu, Feb 15, 2018, 03:54 PM

వారిని దేవుడు చల్లగా చూడాలి : మోహన్ బాబు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 : పైరసీ.. ప్రస్తుత తెలుగు పరిశ్రమ ఈ మహమ్మారి బారిన పడి విలవిలలాడుతుంది. సినిమా విడుదల రోజునే అంతర్జాలంలో చిత్రాలు దర్శనమిస్తున్నాయి. కాగా ఈ విషయంపై ప్రముఖ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ పైరసీకి పాల్పడుతున్న వారిని కూడా దేవుడు చల్లగా చూడాలని ఎద్దేవా చేశారు. గాయత్రి సినిమా పైరసీ కావడంపై హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో తన చిత్ర బృందంతో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి తీసిన సినిమా విడుదల మరుసటి రోజే ఆన్‌లైన్లో రావడం తన మనసును కలిచివేసిందన్నారు.

మోహన్ బాబు ప్రధాన పాత్రలో, ఆర్.ఆర్. మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాయత్రి’ సినిమా ఈ నెల 9న విడుదలై హిట్ టాక్ సంపాదించుకొంది. ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ తదితర తారాగణం నటించారు.





Untitled Document
Advertisements