నిజామాబాద్, ఫిబ్రవరి 15 : ఎర్రజొన్న, పసుపు, పంటల మద్దతు ధరకోసం జిల్లాలోని ఆర్మూర్ లో రైతులు చేపట్టిన రిలే దీక్షలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మద్దతు ధర కోసం అన్నదాతలు తలపెట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో 48 గంటల పాటు 144 సెక్షన్ విధిస్తూ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. 144 సెక్షన్ నేపథ్యంలో పోలీసులు ఆర్మూర్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.