అమరావతి, ఫిబ్రవరి 15 : కృష్ణా, గోదావరి నదీ పర్యవేక్షణ బోర్డు సమీక్ష దేశ రాజధానిలో ముగిసింది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యు.పి.సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, హరీశ్రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండు బోర్డుల పరిధిని నోటిఫై చేయాలనే అంశంపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. నోటిఫై చేసేందుకు నదీ పర్యవేక్షణ బోర్డు సుముఖత వ్యక్తం చేసింది. నోటిఫై చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించగా, మొదట నీటి కేటాయింపులు చేసిన అనంతరం నోటిఫై చేయాలని తెలంగాణ కోరింది.