గుంటూరు జీజీహెచ్‌లో కామినేని తనిఖీలు..

     Written by : smtv Desk | Fri, Feb 16, 2018, 11:56 AM

గుంటూరు జీజీహెచ్‌లో కామినేని తనిఖీలు..

గుంటూరు, ఫిబ్రవరి 16 : గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గురువారం కరెంట్ పోవడంతో చరవాణి వెలుగులో ఆపరేషన్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆస్పత్రిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దీనిపై దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్‌ నిర్వహించిన థియేటర్‌ను పరిశీలించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజునాయుడు ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.





Untitled Document
Advertisements