బెంగళూరు, ఫిబ్రవరి 16 : కావేరి నది జలాల వివాదంలో తమిళనాడుకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. 120 ఏళ్లుగా సాగుతున్నఈ వివాదంపై అత్యున్నత న్యాయస్థానం తమిళనాడుకు విడుదల చేయాల్సిన నీటి పరిమాణంలో కోత పెట్టింది. 177.25 టీఎంసీలను మాత్రమే తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో కర్ణాటకకు అదనంగా 14.75 టీఎంసీల నీరు మిగలనుంది.
ఈ కేటాయింపులతో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కావేరీ జలాల తీర్పుపై తమిళ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేశారు.