తిరుమల, ఫిబ్రవరి 18 : తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజన్ గోగొయ్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తులకు తితిదే ఆధికారులు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు.