విజయవాడ, ఫిబ్రవరి 18 : బీజేపీ కు మిత్ర పక్షంగా ఉన్న టీడీపీ రాష్ట్ర విభజన హామీలపై విమర్శలు గుప్పించడం, ప్రజల ఆందోళన నేపథ్యంలో ఆ పార్టీ విస్తృతస్తాయి సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి బీజేపీ ఏపీ సీనియర్ నేతలు, అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, భాగస్వామ్య టీడీపీ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఎలా ఎదుర్కోవడం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.