అమరావతి, ఫిబ్రవరి 21 : ప్రముఖ నటుడు కమల్హాసన్.. తన రాజకీయ యాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తానూ మహాత్మాగాంధీ కి అభిమాని అన్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హీరో అంటూ పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు తనకు రాత్రి ఫోన్ చేసి పలు విషయాల గురించి చర్చించారని చంద్రబాబు విజన్ అద్భుతం అంటూ కొనియాడారు. తమిళనాట ప్రజల మనసులో ఉన్నా, ఇప్పుడు వారి ఇళ్లల్లోనూ ఉండాలనుకుంటున్నానని తెలిపారు. కాగా కమల్ రాజకీయ యాత్రలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.