బాలీ, ఫిబ్రవరి 23 : ప్రపంచంలో జరిగే కొన్ని వింతలకు ఆశ్చర్యపోక తప్పదు. ఎంతలా అంటే అటువంటి సంఘటనలకు మనం నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పటికే చాలా వింతల గుట్టువిప్పెందుకు శాస్త్రవేతలు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా బాలిలో ఓ మనిషి గుడ్డు పెట్టడం, అది ఎలా జరుగుతుందో అని వైద్యులు తలలు పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
బాలికి చెందిన 14ఏళ్ల అక్మల్ గత రెండేళ్లలో 18 గుడ్లు పెట్టాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్చేశాయి. అయితే ఇదంతా నిజం కాదని చాలా మంది కొట్టిపారేశారు. కానీ గత సోమవారం తమ ముందే రెండు గుడ్లు పెట్టడంతో వైద్యులు నివ్వెరపోయారు. అతను పెట్టిన గుడ్లను పరిశీలించిన ఆసుపత్రి వర్గాలు అది కోడిగుడ్డునేని తేల్చారు.
'మనిషి గుడ్డు పెట్టడం జరగనిది. మలద్వారం గుండా అక్మల్ వీటిని శరీరంలోకి పంపించి ఉండొచ్చు. ఇది మా అనుమానం మాత్రమే. అతణ్ని వారంపాటు మా పరిశీలనలో ఉంచి పరీక్షలు చేపడతాం. దీంతో నిజానిజాలు తేలిపోతాయి' అని సంబంధిత అసుపత్రి ప్రతినిధి వెల్లడించారు.