విజయవాడ, ఫిబ్రవరి 26 : హోదా సాధ్యం కాదనే రాష్ట్రానికి దానికి సమానమైన ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ఇచ్చిందని బీజేపీ ఏపీ అభివృద్ధి కమిటీ చైర్మన్ రఘునాథ్బాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చడంలో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ప్రచారం అసత్యమని తెలిపారు. రాయలసీమ నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రిలు వచ్చిన సీమ అభివృద్ధికి దూరంలో ఉందని, అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.