ఆ ప్రచారం అసత్యం.. : దుబాయ్ పోలీసులు

     Written by : smtv Desk | Tue, Feb 27, 2018, 11:16 AM

ఆ ప్రచారం అసత్యం.. : దుబాయ్ పోలీసులు

దుబాయ్, ఫిబ్రవరి 27 : అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ఉన్న అనుమానాలపై ఇంకా విచారణ పూర్తి కానట్లు తెలుస్తోంది. ఆమె 24 వ తేదీ అర్థరాత్రి దుబాయ్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గుండెపోటుతో మృతి చెందిదన్న వార్తలను తోసిపుచ్చుతూ.. ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిందంటూ వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పొందుపరిచారు. అంతేకాకుండా ఆమె రక్త నమూనాలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీదేవి ఎలా మృతి చెందిందన్న కోణంలో దుబాయ్ పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా.. శ్రీదేవి మృతిపై ఆమె భర్త బోనీకపూర్‌ను మూడు గంటల పాటు విచారించారని వార్తలు వెలువడ్డాయి. ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. తాము బోనీకపూర్‌ను విచారించలేదని, దీనిపై మీడియాలో వస్తున్న కథనాలు అసత్యమని పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని అవన్ని తెలియాలంటే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని దుబాయ్‌కి చెందిన పబ్లిక్‌ ప్రాసిక్యూషన్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందించడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది.





Untitled Document
Advertisements