ముంబై, ఫిబ్రవరి 27: ప్రస్తుతం ఉన్న సమాజంలో స్మార్ట్ ఫోన్ ల వాడకాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటీకే మార్కెట్ లోకి ఎన్నో రకాల ఫోన్ లను ముందుకు తీసుకువచ్చిన శామ్సంగ్ కంపినీ ఇప్పుడు సరికొత్త ఫీచర్స్ తో వోఎల్ఈడీ ఫోన్ను వినియోగదారులకు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో డి.జె.కోహ్ వెల్లడించారు. ఇప్పటికి అరచేతిలో బంధించే ఫోన్ నుండి ట్యాబ్ ఫోన్ ల వరకు చూశాము. కాని ఇప్పుడు పరిమాణంలో పెద్దగా ఉన్న అవసరమైతే మడతపెట్టుకోవడానికి కూడా సౌకర్యం కలిగే ఫోన్ ను ప్రవేశపెట్టనున్నది.
బార్సిలోనాలో జరిగిన ఎస్9, ఎస్9+ ఆవిష్కరణ కార్యక్రమనంతరం మాట్లాడుతూ.. కోహ్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. తాము పోటీ లేని కొత్తరంగంలో అడుగుపెట్టనున్నామని ఆయన అన్నారు. బిక్స్బై వాయిస్ అసిస్టెంట్ ఆధారంగా స్మార్ స్పీకర్ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.