శ్రీవారి సేవలో శ్రీలంక మాజీ అధ్యక్షుడు..

     Written by : smtv Desk | Wed, Feb 28, 2018, 12:09 PM

శ్రీవారి సేవలో శ్రీలంక మాజీ అధ్యక్షుడు..

తిరుమల, ఫిబ్రవరి 28 : శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకోని మ్రొక్కులు చెల్లించుకున్నారు. మహిందాకు తితిదే అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుతూ పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందించారు.





Untitled Document
Advertisements