"ఇంకెన్ని గాయాలు"..? @ జనసేన

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 12:34 PM


అమరావతి, మార్చి 13 : "పోరాడి పోరాడి స్వాతంత్ర్యం తెచ్చారు. ఎన్నెన్నో త్యాగాలకు గుర్తు ఈ గణతంత్ర౦” అంటూ సాగే ఒక ప్రేరణాత్మక పాటను "జనసేన పార్టీ" విడుదల చేసింది. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటు పడే జనసేన.. “ఇంకెన్ని గాయాలు” అనే పేరుతో ప్రజలు పడిన కష్టాలను ఒక్క పాటలో వివరించారు.

బ్యాక్ గ్రౌండ్ లో జాతీయ గీతం ‘జనగణమన’ అంటూ వచ్చే మ్యూజిక్ తో "జై తెలంగాణ", "జై ఆంధ్ర" అంటూ ప్రజల ఆర్తనాదాలతో.. "న్యాయాన్ని గెలుపించడానికి నీలో ఉన్న ఆవేశాన్ని బయటకు తీసి పోరాడు. నీ జాతీయ జెండా పొగరుని చూపించు" అంటూ ప్రతి ఒక్కరిలో ప్రేరణ కలిగించే విధంగా రూపొందించారు. ఈ పాటను జనసేన అధికారిక ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ పాటకు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాల౦దించారు.





Untitled Document
Advertisements