ఏపీ జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్రూం ఇల్లు..!

     Written by : smtv Desk | Fri, Mar 16, 2018, 06:22 PM

ఏపీ జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్రూం ఇల్లు..!

అమరావతి, మార్చి 16 : ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఉగాది కానుకను ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ త్రిబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో విడుదల చేశారు. ఈ అంశంపై పక్కా ప్రణాళికలను రూపొందించేందుకు ఒక కమిటీని సైతం సిద్దం చేశారు. ఇందులో భాగంగా కమిటీ చైర్మన్ గా ఐ అండ్ పీఆర్, రూరల్ హౌసింగ్ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు నియమితులయ్యారు. అంతేకాకుండా కమిటీ మెంబర్లుగా అర్బన్ హౌసింగ్ మినిస్టర్ నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, కన్వీనర్‌గా సమాచార శాఖ ఈవో సెక్రటరీ వెంకటేశ్వర్ లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.





Untitled Document
Advertisements