అభివృద్ధితోనే నక్సలిజం నిర్మూలన: రాజ్‌నాథ్‌

     Written by : smtv Desk | Sat, Mar 17, 2018, 03:22 PM

అభివృద్ధితోనే నక్సలిజం నిర్మూలన: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, మార్చి 17: దేశంలో ప్రధాన సమస్యగా మారిన నక్సలిజాన్నిఅభివృద్ధి ద్వారా నిర్మూలించవచ్చని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అభివృద్ధి దేశంలో ప్రధాన సమస్యగా మారిన నక్సలిజాన్ని కేవలం యుద్ధం, బులెట్స్‌ ద్వారానే అంతం చేయలేమని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. స్వాతంత్య్రం తర్వాత కూడా మనం చేరుకోలేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేస్తేనే నక్సల్‌ ప్రభావం తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘రైజింగ్‌ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్‌నాథ్‌ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా దేశంలో నక్సలిజం ప్రధాన సమస్యగా మారిందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఒక్కటే దానిని అంతం చేయగలదని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements