రాష్ట్రం ఈ ఏడాది సుభిక్షంగా ఉండాలి : చంద్రబాబు

     Written by : smtv Desk | Sun, Mar 18, 2018, 11:59 AM

రాష్ట్రం ఈ ఏడాది సుభిక్షంగా ఉండాలి : చంద్రబాబు

అమరావతి, మార్చి 18 : శ్రీ విళంబి నామ సంవత్సరం తెలుగు వారి జీవితాల్లో కాంతులు నింపాలని, సంతోషం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. "తెలుగు రాష్ట్ర ప్రజలందరికి, అంతేకాకుండా దేశ విదేశాల్లో పండగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉగాది పండగ శుభాకాంక్షలు" అంటూ తెలిపారు.

విళంబి అనగా సుభిక్షం అని శాస్త్రాలు బోధిస్తున్నాయని.. ఈ ఏడాది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఉగాది పరదినాన్ని పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ వేడుకలని ఘనంగా నిర్వహించారు.

చంద్రబాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ వేడుకలో వేదపఠనం, వ్యవసాయ, ఉద్యానవన పంచాంగం ఆవిష్కరించారు. అన౦తరం వేదపండితులకు సత్కారంతో పాటు కళారత్న(హంస) ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు.





Untitled Document
Advertisements