అమరావతి, మార్చి 19 : జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆదేశాల మేరకు విజయవాడ నగర పార్టీ తరపున పలు టీవీ చర్చల్లో పాల్గొనేందుకు వీలుగా ఐదుగురు సభ్యులతో ప్యానల్ స్పీకర్ల విభాగం ఏర్పాటైంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీనేత అద్దేపల్లి శ్రీధర్ ప్యానల్ స్పీకర్లను పరిచయం చేశారు.
వీరిలో కాటూరి శ్రీనివాస్, పోతిన వెంకట మహేష్, బొప్పన శాంసన్, మండలి రాజేష్, కామరాజు హరీష్ కమార్, లను ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో అధికార ప్రతినిధులు, ఇతర విభాగాల ఇంఛార్జీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
అలాగే మిస్డ్కాల్తో సభ్యత్వ కార్డు కూడా వెంటనే వచ్చేయడం ప్రత్యేకత అన్నారు. పార్టీ కార్యకలాపాలను విస్తృత స్థాయిలో నిర్వహించడానికి తాము ప్రతివారం పర్యటిస్తామని.. వివిధ సమాజ సేవా కార్యక్రమాలను చేపడతామని వెల్లడించారు.