మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

     Written by : smtv Desk | Thu, Mar 22, 2018, 03:37 PM

మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సైబర్ టవర్స్ సమీపంలోని పత్రికానగర్ ఖాళీ ప్రదేశంలో పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఉదయం చెలరేగిన మంటల కారణంగా దాదాపు 150 గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డునపడ్డాయి. అందరూ కూలిపనికి వెళ్లిన సమయంలో ప్రమాదం సంభవించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

స్థానికంగా ఉన్న పత్రికా నగర్‌లో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఈ రోజు జరిగిన ప్రమాదంలో గుడిసెలు దగ్ధమవ్వడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రమాద సమయంలో ఎక్కువ మంది బాధితులు పనుల నిమిత్తం వెళ్లారు. ప్రమాదంతో గుడిసెల వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇంతకాలం కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు కాలిబూడదవ్వడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.





Untitled Document
Advertisements