హైదరాబాద్, మార్చి 22: తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో 2018-19 సంవత్సరానికి పీజీ మెడికల్ అడ్మిషన్లను నిర్వహిస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కెఎన్ఆర్ యూహెచ్ఎస్) రిజిస్ట్రార్ ప్రకటన జారీ చేశా రు. నీట్-పిజి-2018 పరీక్షలో అర్హత సంపాదించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కేఎన్ఆర్ యూహెచ్ఎస్, ని మ్స్ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తామని, ఇందుకోసం ఈ నెల 23 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.