హైదరాబాద్, మార్చి 22 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో హీరో నితిన్ ఒకరు. ఎప్పుడైన నితిన్, పవన్ గురించి మాట్లాడే సందర్భం వస్తే తను ఒక హీరో అన్న విషయం మర్చిపోయి మాట్లాడేంతగా.. పవన్ ను అభిమానిస్తాడు. తాజాగా నితిన్ నటించిన 'ఛల్ మోహన్ రంగ' చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ రానున్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
కృష్ణ చైతన్యదర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నితిన్ కి జోడీగా మేఘ ఆకాష్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను ఈ నెల 25న నిర్వహించనున్నట్లు నితిన్ తెలిపారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నట్లు తెలిసిందే. నితిన్ సినిమా ఫంక్షన్ కు పవన్ వస్తే ఆ సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ సినిమా ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తుందా.. లేదా బ్రేక్ వేస్తుందో.. చూడాలి మరీ.