ఎఫ్‌బీ కార్యక్రమాలపై ఈసీ పునరాలోచన

     Written by : smtv Desk | Fri, Mar 23, 2018, 12:45 PM

ఎఫ్‌బీ కార్యక్రమాలపై ఈసీ పునరాలోచన

న్యూఢిల్లీ, మార్చి 23: ఫేస్‌బుక్‌లో ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగం.. అవగాహనా కార్యక్రమాల పై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) పునరాలోచించనుంది. శుక్రవారం సాయంత్రం జరిగే ఈసీ ఉన్నతాధికారుల భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు రానుంది. ఫేస్‌బుక్‌లో డేటా ఉల్లంఘనలు చోటుచేసుకోవడం, ఈ సమాచారాన్ని ఇతర దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కేంబ్రిడ్జి ఎనలిటికా వంటి సంస్థలు ఉపయోగించడం వంటి అంశాలతో ఈసీ ఆందోళన చెందుతున్నట్టు సీఈసీ పేర్కొంది .

ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపేలా ప్రజాభిప్రాయాన్ని మలిచే ప్రయత్నాలు ఆందోళనకరమని..దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. ఈసీ భేటీలో దీనిపై విస్తృతంగా చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.





Untitled Document
Advertisements