భువనగిరి, మార్చి 23: గ్యాంగ్స్టార్ నయీ౦ ఎన్కౌంటర్ వెనుక భువనగిరి నుండి ఢిల్లీ వరకు కుట్ర దాగి ఉందని, నయీ౦ బతికి ఉంటే అమిత్షా జైలుకు వెళ్ళేవారని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. తలమాసిన వారిని అరెస్టుచేసి పోలీసులు అసలు నిందితులను వదిలేసారని ఆరోపించారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్లో అమిత్షా పేరు రాకుండా బీజేపీ ప్లాన్ప్రకారమే నయీ౦ ఎన్కౌంటర్ జరిగిందన్నారు.
ప్రజాతంత్ర, పౌరహక్కుల, లొంగిపోయిన మావోయిస్టులను హతమార్చేందుకు పోలీసులు నయీ౦ను పెంచిపోషించి ఆయుధంగా వాడుకున్నారని స్పష్టం చేశారు. పోలీసుల అండతోనే ఉమ్మడి తెలుగురాష్ట్రాలతో పాటు చత్తీస్గఢ్, ఒడిసా రాష్ట్రాలలో నయీ౦ 80 హత్యలకు పాల్పడ్డాడని అన్నారు. గత ప్రభుత్వాల పాలకులు ముఖ్యమంత్రి, హోంమినిస్టర్లతో సహా ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుఅధికారులు, ప్రజాప్రతినిధులకు నయీ౦తో సంబంధాలు ఉన్నాయని నారాయణ ఆరోపించారు.