హైదరాబాద్, మార్చి 23 : టాలీవుడ్ పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ల మధ్య స్నేహబంధం అందరికి తెలిసిందే. అంతే కాకుండా వీరి కలయికలో వచ్చిన ప్రతి సినిమా పాటలు శ్రోతలను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. 'ఆర్య' సినిమా నుండి మొదలైన వీరి ప్రయాణం ఇప్పటికి అలాగే కొనసాగుతుంది. ఇటీవల విడుదలైన ‘దువ్వాడ జగన్నాథమ్’ పాటలు కూడా అభిమానులను మెప్పించాయి.
తాజాగా అల్లుఅర్జున్ దేవిశ్రీ ప్రసాద్ను గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘మనం వాయించేది కాదు మనం చెప్పేదే గొప్ప పాట అవుతుంది. ఈ వాక్యాన్ని దేవిశ్రీ స్వరాలూ విన్నాక సృష్టించాను.’ అని ట్యాగ్ ఇస్తూ దేవిశ్రీ పియానో వాయిస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్పై దేవిశ్రీ స్పందిస్తూ.."ఈ లవ్లీ పోస్ట్ పెట్టినందుకు థాంక్యూ సో మచ్ మై డియరెస్ట్ ఫ్రెండ్. సారీ..కాస్త ఆలస్యంగా చూశాను. హౌ స్వీట్ ఆఫ్ యూ బన్నీ బాయ్" అని దేవిశ్రీ ట్వీట్ చేశారు