కరీంనగర్, మార్చి 23: కరీంనగర్ మండలం దుర్శేడ్లోని గాంధీ చేతికాగితపు పరిశ్రమను శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్రెడ్డి సందర్శించారు. పాతబట్టలు,వ్యర్థ పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తున్న కాగితాలు, వాటితో వివిధ ఆకృతుల్లో రూపొందిస్తున్న వస్తువులను పరిశీలించారు. చేతికాగితపు చెట్లను పరిరక్షించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. దీంతో గ్రామీణ మహిళలకు ఉపాధి లభిస్తుందని డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు.