నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం..

     Written by : smtv Desk | Sun, Mar 25, 2018, 04:19 PM

నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం..

నిజామాబాద్, మార్చి 25 : నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ వద్ద ఓ ఆటో అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఆటోలో మొత్తంగా 14 మంది ప్రయాణిస్తున్నారు. ముప్కాల్ నుంచి మెండోరా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, మరో 9 మంది గాయాలతో బయటపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements