నిజామాబాద్, మార్చి 25 : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద ఆటో బావిలో పడి పదిమంది మృతి చెందిన ఘటనపై మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆరా తీశారు. ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ ఎంఆర్ఎం రావును ఆదేశించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాలని అధికారులకు సూచించారు. సమాచారం అందుకున్న నగర కలెక్టర్, పోలీస్ కమిషనర్ కార్తికేయ మిశ్రా సహా పలువురు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు.