కర్నూలు, మార్చి 28: శ్రీశైలం ఘాట్ రోడ్డు మార్గంలో రామయ్య మలుపు వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మందికి గాయాలు అయ్యాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి కైకలూరు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులంతా కైకలూరుకు చెందిన వారే. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం.