ఉప్పల్‌లో తుపాకీ కలకలం

     Written by : smtv Desk | Wed, Mar 28, 2018, 03:36 PM

ఉప్పల్‌లో తుపాకీ కలకలం

హైదరాబాద్‌, మార్చి 28 : ఉప్పల్‌లో తుపాకీ కలకలం రేపింది. మెట్రో స్టేషన్లో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి వద్ద తుపాకీ ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది అతన్ని బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. ఎనిమిది రౌండ్లు కల్గిన తుపాకీని పోలీసులు స్వాధీన పరుచుకుని నిందితుడిని ఉప్పల్‌ పీఎస్‌కి తరలించారు.

నిందితుడు తన పేరు సతీష్‌ అని, తాను భూపాలపల్లి జిల్లా కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణ రెడ్డి కారు డ్రైవర్‌నని పోలీసులకు వివరించాడు. నారాయణ రెడ్డి వ్యాపార పనుల నిమిత్తం పూణె వెళ్లడంతో తనకు తుపాకీ ఇచ్చి వెళ్లాడని చెప్పాడు. పోలీసుల విచారణలో నారాయణరెడ్డి పేరు మీదే తుపాకీ రిజిస్టరై ఉన్నట్లు తెలిసింది.







Untitled Document
Advertisements