సిద్దిపేట, మార్చి 28: ఆక్సీజన్ సిలిండర్లు పేలడంతో పట్టణ౦లోని భారత్ నగర్లో ఓ వృద్దురాలు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. గోపరి మల్లయ్య అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ సిలిండర్లు హైదరాబాద్ నుండి తీసుకువచ్చి సిద్దిపేట పట్టణంలో విక్రయిస్తున్నాడు. కాగా బుధవారం మధ్యాహ్నం రెండు సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న లింగమ్మ అనే వృద్దురాలి కాలు తెగిపడింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
ఆమెతో పాటు మనుమడు వెంకటేష్కి తీవ్ర గాయలైనాయి.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వెంకటేష్ను హైదరాబాద్ తరలించారు. ఈ సంఘటనలో అక్కడి ఆవరణలో ఉన్న కుక్క పిల్ల సైతం మృతి చెందింది. డీసీపీ నర్శింహ రెడ్డి, ఏసీపీ రామేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరిస్తున్నారు.