ఉద్యమకారులకే పార్టీలో ప్రాధాన్యం: కోదండరాం

     Written by : smtv Desk | Wed, Apr 04, 2018, 04:22 PM

ఉద్యమకారులకే పార్టీలో ప్రాధాన్యం: కోదండరాం

హైదరాబాద్, ఏప్రిల్ 4‌: రాష్ట్ర సాధన కోసం కీలక పాత్ర పోషించిన వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్ఫూర్తితోనే తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) ఏర్పాటుచేసినట్లు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలోని వీఎస్టీ ఫంక్షన్‌ హాల్‌లో తెలంగాణ జన సమితి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక ఏ సంఘాలు ఉండవని.. అందరూ జన సమితేనని పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ సామాజిక న్యాయమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తుంది. తెలంగాణ కోసం అమరులైన వారి కోసం స్ఫూర్తి వనం ఏర్పాటు చేస్తామన్నారు.





Untitled Document
Advertisements