హైదరాబాద్, ఏప్రిల్ 10: రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్ కళాశాలల యాజమాన్యాలకు కొమ్ముకాస్తూ, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏబీవీపీ నాయకులుఆరోపించారు. వేసవిలో తరగతులు నిర్వహిస్తున్న కార్పోరేట్, ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ఏబీవీపీ ముట్టడించింది.
ఎంతసేపటికి అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో గేటు లోపలికి చొచ్చుకుపోవడానికి ఏబీవీపీ నాయకులు యత్నించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు బలవంతంగా వారిని అరెస్టు చేసి బేగంబజార్ పోలీసుస్టేషన్కు తరలించారు. వేసవిలో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏబీవీపీ నాయకులు అరోపించారు. కార్పోరేట్ కళాశాలల యాజమాన్యాలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.