హోదా ఉద్యమాన్నిఉద్ధృత౦ చేయాలి: రోశయ్య

     Written by : smtv Desk | Tue, Apr 10, 2018, 07:06 PM

హోదా ఉద్యమాన్నిఉద్ధృత౦ చేయాలి: రోశయ్య

విజయవాడ, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటే, ఇప్పుడు చేస్తున్న నిరసనలు సరిపోవని, ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించారు. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో ఉన్న రోశయ్యను కలిసేందుకు ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న వచ్చిన వేళ, రోశయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. తాము చేస్తున్న హోదా ఉద్యమానికి మద్దతివ్వాలని వెంకన్న కోరగా, హోదా ఉద్యమాన్ని ఎవరూ ఊహించనంత ఉద్ధృత స్థాయికి తీసుకు వెళితేనే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.





Untitled Document
Advertisements