షియామి ప్రతినిధులతో చంద్రబాబు సమావేశ౦

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 11:45 AM

షియామి ప్రతినిధులతో చంద్రబాబు సమావేశ౦

తిరుపతి, ఏప్రిల్ 11: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు షియామి సంస్థ ప్రతినిధులతో తిరుపతిలో సమావేశ౦ నిర్వహించారు. శ్రీసిటీ, తిరుపతి ఈఎంసీ-2 ప్రాంతాల్లో షియామి పరిశ్రమ ఏర్పాటుపై సీఎం చర్చించారు. మంత్రులు లోకేశ్‌, అమర్‌నాథ్‌రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం వారికి వివరించారు. మంత్రి లోకేశ్‌‌ మంగళవారమే తిరుపతికి వచ్చి సంస్థ ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రయోజనాలను సంస్థ ప్రతినిధులకు వివరించారు.





Untitled Document
Advertisements