మహిళా హెడ్‌మాస్టర్‌పై కత్తితో దాడి

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 01:42 PM

మహిళా హెడ్‌మాస్టర్‌పై కత్తితో దాడి

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 11: పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్‌మాస్టర్‌పై ఆమె భర్త కత్తితో దాడి చేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్ మండలం ముసులేపల్లి పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ దాడిలో హెడ్‌మాస్టర్ కన్యాకుమారి తీవ్రంగా గాయపడింది. అనంతరం భర్త కూడా గొంతుగోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలతో భర్త రమణారెడ్డి దాడి చేసినట్లుగా సమాచారం.





Untitled Document
Advertisements